Tuesday, April 30, 2024
- Advertisement -

ఏ రాష్ట్రానికి ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చారంటే…!

- Advertisement -

దేశవ్యాప్తంగా మెడికల్​ ఆక్సిజన్​ను మరింత అందుబాటులో ఉంచేందుకు పీఎం-కేర్స్​ నిధి నుంచి రూ.201.58 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. ప్రధానంగా కొవిడ్​ బారిన పడినవారికి, వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి అవసరమైన ఆక్సిజన్​ను తగినంతగా, నిరంతరాయంగా అందించటం వీటి లక్ష్యమని పేర్కొంది.

ఈ మేరకు తెలంగాణ సహా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 162 పీఎస్​ఏ మెడికల్​ ఆక్సిజన్​ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలోని 5 ఆసుపత్రులకు ఈ ప్లాంట్లు మంజూరయ్యాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి ఆయా రాష్ట్రాలతో సంప్రదించి ఆసుపత్రులను గుర్తించినట్లు పీఎంఓ తెలిపింది.

వీటి సామర్థ్యం 154.19 మెట్రిక్​ టన్నులుగా పేర్కొంది. వీటి ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్​ లభ్యత పెరగడమే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సమయానికి అందుబాటులో ఉంచడానికి కూడా వీలవుతుందని పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -