అక్కినేని సమంత.. కుందనపు బొమ్మలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టాప్ హీరోల సరసన నటించి తన సత్తా చాటుకుంది. ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయితే కరోనా కాలంలో సైతం తన మార్క్ ను ఇంకా పెంచుకుంది.
ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈ సుందరి.సినిమాలు చేతిలో లేకున్నా.. అంతకంటే ఎక్కువగానే ఓటీటీల ద్వారా ఈ అమ్మడు సంపాధించిందని చెప్పాలి. ఇలా తన యాక్టింగ్ తో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఈ చిన్నది ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్లో ఎంతో మంది టాప్ హీరోయిన్లను ఈజీగా దాటేస్తూ.. తన క్రేజ్ ను పెంచుకుంటుంది.
అనుష్క, పూజా హెగ్డే, తమన్నా, రష్మిక మందన్నా, కీర్తిసురేష్ లాంటి టాప్ హీరోయిన్లను ఇప్పటికే వెనక్కి నెట్టేసి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ని సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్ 15 మిలియన్ల ఫాలోయింగ్ తో మరో మైలురాయిని ఈ చిన్నది సాధించేసింది. ఈ విజయానికి కారకులైన ప్రతీ ఒక్కరికి సమంత ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పెసింది.