సమంత అక్కినేని ఇటీవల కేవలం విభిన్న చిత్రాలకు మాత్రమే ఓకే చెబుతున్న విషయం తెలిసిందే. సమంత ఇటీవల అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ -2లో ఎల్టీటీఐ ఉగ్రవాదిగా కనిపించింది. ఈ పాత్ర ఎన్నో వివాదాలు సృష్టించినప్పటికీ.. సమంతకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.ఇదిలా ఉంటే సమంత మరో చాలెంజింగ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. పురాణేతీహాసాల్లోని ‘శకుంతల’ పాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీలో సమంత.. టైటిల్ రోల్ పోషిస్తున్నది. దుష్యంతుడి పాత్రను.. మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్నది. కానీ కరోనా ఎఫెక్ట్తో షూటింగ్ ఆగిపోయింది.అయితే త్వరలో ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతున్నట్టు టాక్. నెలఖరున ఈ మూవీ మళ్లీ సెట్స్ మీదకు వెళ్ల బోతున్నదట.
ఇప్పటికే హైదరాబాద్లో ఓ భారీ సెట్టింగ్ వేశారట. సమంత.. దేవ్ మోహన్ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఇక్కడ షూట్ చేయబోతున్నట్టు సమాచారం. శాకుంతలం సినిమాను ‘దిల్’ రాజుతో కలసి గుణ శేఖర్ తనయ నీలిమ గుణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో గుణశేఖర్ రుద్రమదేవి అనే చారిత్రక సినిమాను తెరకెక్కించి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఈ సారి ఓ పురాణేతిహాస కథను తెరకెక్కించబోతున్నాడు.
Also Read