Tuesday, May 14, 2024
- Advertisement -

మా ఆస్తులన్నీ పోయాయి.. రాజమాళి సంచలన వ్యాఖ్య!!

- Advertisement -
Rajamouli Loss The Properties..

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి, అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్ లు ఏంచేసినా, ఏం మాట్లాడినా సంచలనంగా మారుతున్నాయి. తాజాగా రాజమౌళి.. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘శ్రీవల్లి’ మూవీ ఆడియో కార్యక్రమంలో  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.

ఒకప్పుడు తాము చాలా ధనవంతులమని, అయితే తర్వాత తమ ఆస్తులన్నీ పోయాయని తెలిపాడు. తన తాతయ్య చాలా ధనవంతుడని, తన తండ్రి, పెద్దనాన్న సిల్వర్ స్పూన్ తో పుట్టారని, అయితే తర్వాత కాలంలో తమ ఆస్తులన్నీ హరించుకుపోయాయని గత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. రెండు గదుల ఇంటిలో 15 మంది వరకు ఉండేవాళ్లమని, ఇన్ కమ్ సోర్స్ కూడా ఎక్కువగా ఉండేది కాదని వివరించాడు. తాము కూడా  బాధలు పడ్డామని, చాలా సంవత్సారాలు వెయిట్ చేసిన తర్వాత తన తండ్రి పేరు జానకి రాముడు సినిమాకి వెలుగులోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

{youtube}bCabL6Q-0NQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -