దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే వకీల్ సాబ్ సినిమా బెన్ఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇటు బీజేపీ కూడా జనసేనానికి అండగా నిలిచింది. దాంతో పవన్ను టార్గెట్ చేసి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదని బీజేపీ, జనసేన, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఈ విషయం కాస్త ఏపిలో పొలిటికల్ వార్ కి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. పార్టీ నేతల విమర్శలపై మంత్రి పేర్ని నాని స్పందించి.. రాజకీయాలకు, సినిమాలకు సంబంధమేంటని ప్రశ్నించారు. చట్టం ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉంది. పాచిపోయిన లడ్డూ తినిపించే పవన్ ఆయన సంబందీకులు ఇది రాజకీయం చేయడం చోద్యంగా ఉందని విమర్శించారు. దీనిపై నటుడు, పవన్ సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
‘మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కారోనా వాక్సిన్తో పాటు రేబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీస్ సెండ్ రేబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ.’ అంటూ ఘాటుగా స్పందించారు.
అయితే దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని కూడా నాగబాబుకి ఘాటుగానే స్పందించారు. ‘పరోపకారి పాపన్న నాగబాబు గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు’ పవన్, నాగబాబు ని ఉద్దేశించి ట్విట్ చేశారు.