దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికీ నైట్ కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే సినీపరిశ్రమ కూడా షూటింగ్ ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరి, టక్ జగదీష్, విరాట పర్వం, ఆచార్య, నారప్ప వంటి సినిమాల విడుదల తేదీలను మార్చుకున్నారు.
తాజాగా జెమిని టీవీలో ప్రసారం కానున్న రియాలిటీ గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ద్వారా మరికొద్ది రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర పై సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోతో సర్ ప్రైజ్ చేసారు. ‘ఇక్కడ కథ మీది కల మీది.. జీవితాన్ని మారుద్దాం రండి.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ మీసం మెలేసి మరీ చెప్తున్నాడు ఎన్టీఆర్. వచ్చే నెల నుంచి ఈ షోను టెలికాస్ట్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ దాడి ప్రారంభం కావడంతో ఈ షో ని వాయిదా వేయక తప్పలేదట.
Also read:కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత.. ఆచార్యకు కష్టాలు తప్పవా?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, అలియాభట్, ఒలియా ముఖ్యప్రాల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ అయిపోయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also read:ఆ హీరోయిన్ నిర్ణయం కారణంగా ప్యాకప్ చెప్పిన నాని..!