Friday, April 26, 2024
- Advertisement -

కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత.. ఆచార్యకు కష్టాలు తప్పవా?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు కొరటాల శివకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. తాను దర్శకత్వం వహించే సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, గొప్ప సందేశాలతో సినిమాలను రూపొందిస్తూ ఉంటాడు.ఇదివరకే కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి, భరత్ అనే నేను, శ్రీమంతుడు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి.ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల శివకు, నిర్మాత దిల్ రాజుకు మధ్య పలు మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమా మార్కెటింగ్ విషయంలో కొరటాల శివ దగ్గరుండి అన్ని విషయాలను చూసుకున్నారు. అయితే ఈ సినిమా మార్కెటింగ్ విషయంలో కొరటాల శివ దిల్ రాజు కి మూడు కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ విషయాన్ని కొరటాల శివ ఆచార్య సినిమా విడుదల సమయంలో తన బాకీ వసూలు చేసుకోవాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆచార్య సినిమా నిర్మాతలైన నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కి దిల్ రాజుల మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. మరి ఈ మూడు కోట్ల విషయంలో దిల్ రాజు ఆచార్య సినిమా విడుదల టైంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ప్రభాస్ పై శ్రుతి హసన్ కామెంట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -