Thursday, May 16, 2024
- Advertisement -

మా నాన్నకు పిచ్చి ఉండేది అంటూ షాకింగ్ విషయం చెప్పిన అనసూయ!

- Advertisement -

తెలుగు టెలివిజన్ తెరపై ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈమె తన అందం,అభినయంతో బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో పలు సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. అన‌సూయ‌ “క్ష‌ణం” సినిమాతో వెండితెరపై న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత బ్లాక్ బస్టర్ మూవీ “రంగ‌స్థ‌లం” లో రంగమ్మత్త పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మాది ఒకప్పుడు ధనిక కుటుంబమేనని మాకు గుర్రాలు ఉండేవి మా నాన్నకు హార్స్ రేసింగ్, గ్యాంబ్లింగ్ పిచ్చి బాగా ఎక్కువ ఉండేది. వాటి మూలంగానే మా ఆస్తిపోయిందంటూ అనసూయ చెప్పుకొచ్చారు.అలాగే మా నాన్న ఎప్పుడు స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని మాకు చెప్పేవారని అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పింది.

Also read:13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమాను ఆహా ఓటీటీ వేదికపై రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్.ఇక కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తోన్న రంగ మార్తాండ‌లో అన‌సూయ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ప్రస్తుత అనసూయ తమిళ్, మలయాళం సినిమాలలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

Also read:చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -