అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో భారీ స్థాయిలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. బన్నీ పుష్ప షూటింగ్లో పాల్గొనడంతో అక్కడే కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది.బన్నీ తనకు కరోనా వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తాను ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉన్నానని, గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
బన్నీ ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి అందరూ ఒకేచోట ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అవి నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇలా బన్నీ తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండటంతో కరోనా తగ్గి ఉంటుందని అందరూ అనుకున్నారు.తన ఆరోగ్య పరిస్థితి పై క్లారిటీ ఇచ్చేందుకు బన్నీ పోస్ట్ చేశారు.కరోనా తగ్గుముఖం పట్టిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, ఇంకా క్వారంటైన్లొనే ఉన్నానని చెప్పుకొచ్చారు.
Also read:వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?
అల్లుఅర్జున్ గారాల కూతురు అర్హ వంటింట్లో గరిట పట్టి దోశ వేసే వీడియో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ఫన్నీగా దోశలు వేయడం బహుషా నా దగ్గరే నేర్చుకుని ఉంటుందని రాములో రాముల స్టెప్పులను గుర్తుకు చేసుకున్నారు. రాములో రాములో స్టెప్పులను దోశ స్టెప్పులంటూ ఆ మధ్య అర్హ గాలి తీసేసిన సంగతి తెలిసిందే. అలా అర్హ వేసిన చిట్టి చిట్టి దోశలను చూపిస్తూ ఇది ఎప్పటికీ మరిచిపోలేని దోశ అంటూ బన్నీ మురిసిపోయారు.
Also read:ట్రైన్ లో బాత్రూం వద్ద పట్టుకున్నారంటూ గుట్టు విప్పిన సీనియర్ నటి రజిత!