Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి కరోనా.. త్వరగా కోలుకోవాలి బ్రదర్ అంటూ మహేష్ ట్వీట్!

- Advertisement -

దేశం వ్యాప్తంగా కరోనా తీవ్రత అధికమవుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. ఇక సినిమా రంగంలో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడినట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తెలియజేశారు.

తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిందని, అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, విషయం తెలియగానే కుటుంబం మొత్తం ఐసోలేట్ అయ్యాం.. వైద్యుల సూచనల మేరకు అందరం కూడా జాగ్రత్తలను పాటిస్తున్నామంటూ తెలిపారు. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారందరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Also read:తప్పు నాది.. మా కుటుంబాన్ని ఎందుకు లాగింది? శ్రీరెడ్డిపై అభిరామ్ ఫైర్!

యంగ్ టైగర్ కరోనా బారినపడినట్టు తెలియడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి రకుల్ ప్రీత్ సింగ్ గెట్ వెల్ సూన్ అని ట్వీట్ చేయగా… మహేష్ బాబు మహేష్ బాబు త్వరగా కోలుకోవాలి బ్రదర్.. అంటూ ట్వీట్ చేశారు.

Also read:నలబై ఏళ్లకు పిల్లలు, భర్త మరణం.. రాత్రి వాళ్ళు అలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -