Friday, March 29, 2024
- Advertisement -

నలబై ఏళ్లకు పిల్లలు, భర్త మరణం.. రాత్రి వాళ్ళు అలా?

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్యామల బుల్లితెరపై యాంకర్ గా, సీరియల్స్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే బిగ్ బాస్ సీజన్ 2 షో ద్వారా శ్యామలకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ రావడంతో వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటిస్తు ఫేమస్ అయ్యారు.ప్రస్తుతం యాంకర్ శ్యామల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లతో బిజీగా ఉంటూ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

నిన్న మదర్స్ డే ఈ సందర్భంగా యాంకర్ శ్యామల అభిమానులకు విషెస్ చెప్తూ ,తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తల్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. అమ్మకు 40 ఏళ్ళు వచ్చాక నేను పుట్టానని, నాకు ఏడాది వయసు ఉండగా నా తండ్రి చనిపోయాడనీ, ఇక అప్పటి నుంచి అమ్మే తనను చూసుకుంటుందని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు నటి శ్యామల. తమకు ఎంతో మంది బంధువులు ఉన్న కూడా ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ అమ్మ వారి పట్ల ఎప్పుడు ద్వేషం చూపక వారికి మంచి జరగాలని కోరుకునేది.

Also read:‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

ఇక తన తల్లి నర్సుగా పని చేసేదని, ప్రతిరోజు సైకిల్ మీదే వెళ్లి విధులను నిర్వహించేవారట.
అప్పుడప్పుడు తను కూడా తల్లితో వెళ్లేదట‌ఒకసారి తిరిగి రావడంలో ఆలస్యం అయితే కొంతమంది ఆకతాయిలు అమ్మ వెనకాల వచ్చారని, అమ్మని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారట. కానీ తన తల్లి మాత్రం వాళ్ళను దగ్గరికి పిలిచి నీకేం కావాలి అంటూ, తన వయసు 44, 45 ఉంటుందని , మీ అమ్మ వయసు మీకు ఇది పద్దతిగా ఉందా అంటూ క్లాస్ పీకారంటా. ఇక అప్పటి నుంచి వాళ్లే తన తల్లికి రక్షణగా ఉంటూ, ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అంటూ అనేవారట. ఇలా తన తల్లి గురించి కొన్ని ఎమోషనల్ విషయాలు మదర్స్ డే సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.

Also read:మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి సునీత గారు.. లైవ్ లో ఘాటు రిప్లై!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -