ఈ మద్య కొంత మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. మాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి ‘ఫిదా’ మూవీతో తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. ఇదే బాటలో తొలి సినిమా ‘ఉప్పెన’తో ఓవర్నైట్ క్రేజ్ సంపాదించుకుంది కృతీ శెట్టి. ప్రస్తుతం టాప్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు వరుస గా నటించే ఛాన్స్ దక్కించుకుంటుంది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనుషుల్లో ఒక్క విషయం తనకు అసలు నచ్చదని చెప్పింది.
ఇంతకీ ఏంటా మ్యాటర్ అంటారా.. అబద్దం చెప్పేవారంటే అసహ్యమని చెప్పింది. అది అమ్మాయి, అబ్బాయి ఎవరైనా అలాంటి వారంటే తనకు అసహ్యం అని చెబుతుంది. నిజాయితీగా, బోల్డ్గా ఉండే వ్యక్తులు నచ్చుతారని, ఏ విషయన్నైనా మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పేంత ధైర్యం ఉండాలని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఏదైనా తప్పు చేస్తే అది నిర్భయంగా ఒప్పుకొనే వారంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇక అబ్బాయిలు అబద్దాలు చెబితే తనకు అసలు నచ్చదని తెలిపింది.
అలాంటి వారి వల్లనే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు సర్వ నాశనం అవుతున్నాయని చెబుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా వస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సుధీర్బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్గా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
బుజ్జులు బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు.. అంటున్నరోషన్