కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపొమ్మన్నారంటూ చెప్పుకొచ్చింది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో ఏం జరిగిందన్న విషయం ఆమె బయటపెట్టింది. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ‘లాక్ అప్’ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కంగన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.‘‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో పెద్దగా పరిచయాలు లేవు. దీంతో అందరూ నన్ను ఏడిపించేవారు.
ఇంగ్లిష్ మాట్లాడటం రాదని.. కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు. ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో.. అని కొందరు ముఖంపైనే చెప్పేవారు. కానీ, నిర్మాత ఏక్తాకపూర్ అలాంటి వ్యక్తి కాదు. నా కెరీర్ ప్రారంభమైన సమయంలో ఆమెతో కలిసి పనిచేశాను. చాలా మంచి వ్యక్తి. నాకు మొదటి హిట్ని ఇచ్చింది కూడా ఆమె.
ఆమె ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు’’ అని కంగన తెలిపింది. బాలీవుడ్ నటి, నిర్మాత ఏక్తాకపూర్ ఎంతో మంచి వ్యక్తి అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. నటుడు జితేంద్ర కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తన తండ్రి ఫేమ్ ఉపయోగించుకోకుండా ఆమె కెరీర్లో దూసుకెళ్తున్నారని ప్రశంసించింది.
పూర్తిగా మారిపోయిన మీరా జాస్మిన్
నటి సంజనకు అశ్లీల సందేశాలు.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..?