- Advertisement -
మెగా మూవీ ఆచార్యలో సూపర్ స్టార్ మహేశ్ తన వంతు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఇందుకు చిరంజీవి ధన్యవాదాలు కూడా తెలిపారు. నేను, రామ్ చరణ్ ఎంతలా థ్రిల్ అయ్యామో ప్రేక్షకులు సైతం అంతే థ్రిల్ ఫీలవుతారని చిరు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీకి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.
ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ నిర్థారిస్తూ ట్వీట్ చేశారు. మా మూవీలోని పాద ఘట్టాన్ని మహేశ్ తన గొంతుతో మొదలుపెట్టడం ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. తాను అడగగానే వాయిస్ ఓవర్ చెప్పేందుకు మహేశ్ ఒప్పుకున్నారని దర్శకుడు కొరటాల తెలిపారు.
మహేశ్ వాయిస్ తో అందరూ కథలోకి వెళ్లిపోతారని తెలిపారు. ఆచార్యకు అద్భుతమైన వాయిస్ ఇచ్చినందుకు మహేశ్ కు థ్యాంక్స్ చెప్పారు.
బీస్ట్ డైరెక్టర్పై విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు