సైబర్ ప్రపంచాన్ని వణికిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై కారణంగా అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళన తీవ్రమైంది.ఇప్పటికే కొన్ని దేశాలు ఈ దాడినపడిన సంగతి తెలిసందే.ముందు గాగ్రత్తగా అమెరియా చర్యలు తీసుకుంటోంది.యూరప్ నుంచి అమెరికాకు విమానంలో వచ్చే ప్రయాణికులు ల్యాప్టాప్లు తీసుకురావద్దని నిషేధం విధించారు. ప్రయాణికుల వద్ద ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్ లాంటి గాడ్జెట్లు తెస్తున్నారా అనే కోణంలో విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సూచించింది.
అవసరమైతే యూరోప్ ఎయిర్లైన్స్ను అమెరికాకు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని భావిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి డేవిడ్ లాపన్ అన్నారు. యూరోపియన్ ఎయిర్లైన్స్తో పాటు పలు దేశాల ఎయిర్లైన్స్ను ఆమెరికాకు రాకుండా త్వరలో నిషేధించే దిశగా ఆమెరికా అడుగులు వేస్తుంది.యూరప్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న ర్యాన్సమ్వేర్ వాన్నా క్రై భారిన అమెరికా పడకుండా ఉండాలంటే ఈ చర్యలు తప్పవన్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
సమ్మర్లో ఈయూ నుంచి ప్రతివారం 3250కి పైగా విమానాలు అమెరికాకు వస్తుంటాయని, ఆ సమయంలో సైబర్ వైరస్ భారినపడ్డ వారి డివైజ్లు ల్యాప్టాప్లు, ట్యాబ్స్ వంటి వాటివల్ల తమ దేశంలోనూ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని డేవిడ్ లాపన్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ దాడి వల్ల బ్యాటరీలు పేలిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో ఉగ్రదాడులు జరగొచ్చునని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని చెప్పారు.
Related
