Monday, May 20, 2024
- Advertisement -

త్వ‌ర‌లో వైసీపీ కండువా క‌ప్పుకోనున్న కాంగ్రెస్ మాజీ మంత్రి

- Advertisement -
Nandyal Congres Ex minister joinning soonly in ycp

నంద్యాల రాజ‌కీయాలు రోజుకొక మ‌లుపు తిరుగుతున్నాయి.భామా నాగిరెడ్డి మ‌ర‌ణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్తి ఎవ‌ర‌నేదానిపై టీడీపీలో కుమ్ములాట‌లు కొన‌సాగుతున్నాయి.

అయితే వైసీపీలో మాత్రం అలాంటి కుమ్ములాటులు లేవు.టీడీపీని ధీటుగా ఎదుర్కోవాలంటె వైసీపీ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్తిని దింపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు జ‌గ‌న్‌.
ఉప ఎన్నిక టికెట్టు కోసం అధికార పార్టీలోనే తీవ్ర పోటీ నెల‌కొంది.ప్ర‌ధానంగా భామా అఖిల‌ప్రియ వ‌ర్గం,శిల్పా వ‌ర్గాలతోపాటు మాజీ మంత్రి ఫ‌రూక్ అబ్దుల్లా మ‌ధ్యపోటీ తీవ్ర స్థాయిలో ఉంది.వీల్ల‌లో ఎవ‌రికి టెక్టు ఇచ్చిన ఇంకోకు స‌హ‌క‌రించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో బాబుకు త‌ల‌నొప్పిగా మారింది.ప్ర‌ధానంగా శిల్పా మోహ‌న్ రెడ్డి …భూమా అఖిల ప్రియలు టికెట్టుకోసం శ‌త‌విధాల ప్ర‌య‌త్నం చేస్తున్నారు.అయితే శిల్పా వ‌ర్గాన్ని ఫ‌రూక్‌,భూమా వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.
అధికార పార్టీలో కుమ్ములాట‌లు తీవ్ర‌స్తాయిలో ఉంటే..ప్ర‌తిప‌క్షం వైసీపీ మాత్రం క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల‌లో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ మాజీ మంత్రి గంగుల ప్ర‌తాప్‌రెడ్డినిపై వైసీపీ చూపు ప‌డింది.ఇప్ప‌టికే త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించి ప్ర‌తాప్‌రెడ్డ కాంగ్రెస్ పార్టీకి రాజీమాచేసి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేర‌నున్నారు.ఆయ‌న వైసీపీలో చేర‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.
భూమానాగిరెడ్డి కుటుంబం టీడీలో చేర‌డంతో బ‌ల‌హీనంగా ఉన్న వైసీపీని మ‌ల్లీ దారిలో పెట్ట డానికి జ‌గ‌న్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న గంగుల ప్ర‌తాప్‌రెడ్డిని పార్టీలో చేర్చ‌కొనేందు సిద్ధంగా ఉంది వైసీపీ.భూమా కుటుంబానికి..గంగుల కుటుంబానికి మ‌ధ్య‌వైరం ఉంది.ఆళ్ల‌గ‌డ్డ‌నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా,నంద్యాల పార్ల‌మెంట్‌నుంచి ఎంపీగా మ‌రోసారి రాజ్య‌స‌భ్యుడిగా ఉన్న చ‌రిత్ర ప్ర‌భాక‌ర్‌రెడ్డికి ఉంది.ఇప్ప‌టికే త‌మ్ముడు గంగుల ప్ర‌తాప్‌రెడ్డి వైసీపీ త‌రుపున ఎమ్మెల్సీగాఉన్నారు.ఈస‌మ‌యంలో నంద్యాల బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే విజ‌యం ఖాయ‌మ‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి.
సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాల‌లో ఉన్న ప్ర‌తాప్‌రెడ్డికి ప్ర‌జాద‌ర‌న‌తోపాటు.. వాక్‌చాతుర్యం ఉంది.1992లో అప్ప‌టి ప్ర‌ధాని పి.వి.న‌ర‌శింహారావుకు టికెట్‌ను త్యాగం చేసిన విష‌యాన్ని ప్ర‌జ‌లూ ఇప్ప‌టికీ గుర్తుంచుకుంటున్నారు.టీడీపీ శిల్పాకు టికెట్టు ఇస్తే వైసీపీ నుంచి గంగుల ప్ర‌తాప్‌రెడ్డి బ‌రిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.దీంతో పాటు శిల్పాకు బ‌ద్ద‌శ‌త్రువైన ఫ‌రూక్ వ‌ర్గం వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌నేది స‌మాచారం.అన్నీ చూసుకుంటె నంద్యాల రాజ‌కీయాలు ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డంలేదు.

Related

  1. జ‌గ‌న్ స‌వాల్‌ను స్వీక‌రించే ద‌మ్ము బాబు కుందా….
  2. జగన్ కు పెద్ద షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత
  3. జగన్ గ్రీన్ సిగ్నల్.. వైసీపీలోకి టీడీపీ సీనియర్ మాజీ మంత్రి
  4. సొంత జిల్లాలో బాబుకు షాక్‌… పెద్ద ఎత్తును వైసీపీలోకి వ‌ల‌స‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -