2019 ఎన్నికలకోసం వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు.వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలపు కోసం ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుపున గెలుపు గుర్రాలను బరిలో దించడం కోసం జగన్ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆయన రాజకీయ నేత ద్వారా అంతర్గత సర్వే కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈసర్వేలోఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి వైసీపీకి 118, టీడీపీకి 37 సీట్లు వస్తాయని తేలినట్లు సమాచారం.ప్రస్తుతం సిట్టింగ్ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు.. వారి విజయావకాశాలు.. ద్వితీయ శ్రేణి నాయకులు.. వారి విజయావకాశాలపై జగన్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం
{loadmodule mod_custom,Side Ad 1}
ఇప్పటికే సర్వేకు సంబంధించిన రిపోర్టుల్లో కొంత భాగం ఇప్పటికే జగన్ కు అందినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీలో బలమైన నాయకులను గుర్తించేందుకు జగన్ ఈ సర్వే చేయించారు. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల ముందుగానే సర్వేని పూర్తి చేసి ఆరిపోర్టులను ప్లీనరీలో చర్చించనున్కనట్లు తెలుస్తోంది. ఈరిపోర్టుల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది.
{loadmodule mod_custom,Side Ad 2}
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్తులు …. ప్రస్తుతం నియేజక వర్గ సమన్వయ కర్తలుగా వ్వవహరిస్తున్న వారికి టికెట్లు ఇస్తే …వారు గెలుపొందే అవకాశాలు…ద్వితీయ శ్రేని నాయకులు పోటీ చేస్తే వారు గెలుపొందే అంశాలపై సర్వే చేయనున్నారు. వీరితోపాటు అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా.. పార్టీలో చేరడానికి ఆసక్తితో ఉన్నారా?, వారిని చేర్చుకోవడం పార్టీకి ఎంతమేర కలిసొస్తుంది? వంటి అంశాలను జగన్ పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది జగన్కు మంచి పరిణామమే.
{loadmodule mod_sp_social,Follow Us}
Related