ఏపీలో రాజకీయాలు వైసీపీ వర్సెస్ టీడీపీగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అవినీతి కేసుల్లో చంద్రబాబు రిమాండ్లో ఉండగా రేపోమాపో నారా లోకేష్ని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు బాలకృష్ణ పేరును కాకుండా బ్రాహ్మణీ పేరును తెరపైకి తెస్తున్నారు. ఇక ఇప్పటికే బాబు అరెస్ట్ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేశారు బ్రాహ్మణి. పలుమార్లు చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన డైరెక్షన్లో రాజమండ్రిలో మకాం వేసి నేతలను దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత పాదయాత్రకు లోకేష్ బ్రేక్ ఇవ్వగా ఆ పాదయాత్రను కంటిన్యూ చేసేందుకు సిద్దమవుతున్నారు బ్రాహ్మణీ. దీనంతటికి కారణం జూనియర్ ఎన్టీఆర్ పేరు రాకుండా ఉండటం కోసమేనని వాదనలు వినిపిస్తున్నాయి.
అందుకే ఇప్పుడు టీడీపీ నేతలంతా బ్రాహ్మణి జపం చేస్తున్నారట. అయితే ఎవరు ఔనన్నా కాదన్న టీడీపీకి ఎప్పుడు ఏ ప్రాబ్లెం వచ్చినా.. అప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. అందుకే చంద్రబాబు అరెస్ట్ తర్వాత జూనియర్ పేరే వినిపించింది. టీడీపీ నేతలను ఆయన అభిమానులు జూనియర్ ఎందుకు చంద్రబాబు అరెస్ట్పై స్పందించడం లేదనే ప్రశ్నలు కూడా అడిగారు.
అయితే దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ నేతలు జూనియర్ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికి కారణం చంద్రబాబుతో పాటు సీనియర్లకు ఉన్న అభద్రతా భావమేనని టాక్ కూడా నడుస్తోంది. లోకేష్ కోసం ఎన్టీఆర్ ను బాబు దూరం పెట్టారనే అపవాదు కూడా ఉంది. అందుకే ఎన్టీఆర్కు ప్రత్యామ్నాయంగా బ్రహ్మణీని తెరపైకి తీసుకొస్తున్నా టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..