కరణ్ జోహార్… బాలీవుడ్ అగ్ర నిర్మాత. అంతేగాదు హోస్ట్ కూడా. సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఎంత పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు . ఇక కరణ్ హోస్ట్గా వస్తున్న షోలో ఒకటి కాఫీ విత్ కరణ్. అత్యంత ప్రజాదారణ పొందిన షోల్లో ఇది ఒకటి. ఎందుకంటే వచ్చే గెస్ట్లను తన ప్రశ్నలతో ఇబ్బందిపెడతారు. ఎలాంటి మొహమాటం లేకుండా వర్జినిటీ ఎప్పుడు కొల్పోయావు…ఎంతమందితో సెక్స్లో పాల్గొన్నావు లాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు.
ఇప్పటివరకు ఈ షోకి బాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ నుండి సమంత, ప్రభాస్ లాంటి స్టార్లు హాజరయ్యారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్తో బాలీవుడ్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అందుకే జూనియర్ని కాఫీ విత్ కరణ్ కార్యక్రమ నిర్వాహకులు సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదే ఎపిసోడ్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో 8వ సీజన్ ప్రారంభం కానుండగా పెళ్లి తర్వాత తొలిసారిగా ఈ షోలో పాల్గొననున్నారట రణవీర్ సింగ్ – దీపికా పదుకొణె. అలాగే రామ్చరణ్ కూడా పాల్గొంటారని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు అంతా ఎన్టీఆర్ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.