ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ అయి నెలలు గడుస్తున్న ఇంతవరకు ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. అభిమానులు మాత్రం ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
మహేష్ బాబు కెరీర్లో ఇది 29వ సినిమా కాగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. ఎందుకంటే వచ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు నిర్మాత గోపాల్ రెడ్డి. ఇది కాస్త వైరల్గా మారడంతో మహేష్ ఫ్యాన్స్ అంతా నిరాశలో మునిగిపోయారు.
అయితే వైరల్ అవుతున్న వీడియో గతేడాది గోపాల్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చింది. సో మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి నిరాశ చెందనవసరం లేదు. ఈ ఏడాదే మహేష్ మూవీ పట్టాలెక్కడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించాడు సూపర్ స్టార్.