విశాఖ జిల్లాలో భూకుంభకోనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.దీనిలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపనలు వచ్చాయి.ఏకంగా మంత్రి గంటా హస్తం ఉందని టీడీపీ నాయుకులే బహిరంగంగా విమర్శించారు.ఇప్పటికే దీనిపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్గా ఉంది.
తాజాగా విశాఖ సబ్రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్యనాయుడు నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహించింది.ఏకంగా తిరుపతి,విశాఖలో సోదాలు నిర్వహించారు.సోదాలో దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి.దాదాపు రూ.6కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు తెలిపారు.
{loadmodule mod_custom,GA1}
రెండు ప్రాంతాల్లో భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.విశాఖలో 15 ఓపెన్ ప్లాట్లు ఉండగా … వాటిలో నర్వలో ఐదు ప్లాట్లను గుర్తించారు అధికారులు.నాలుగు ఎకరాల ల్యాండ్తోపాటు…1000 స్కైర్ యార్డుల స్తలాన్ని గుర్తించారు.దీంతోపాటు తిరుపతిలో 5 అంతస్తుల లాడ్జి ఉన్నట్లు సోదాల్లో బయటపడింది.
అతని నివాసంలో 1.75 కి.లో. బంగారం,350 గ్రాముల వెండి లభ్యమయ్యింది.ఇంట్లో ఉన్న సామాగ్రి దాదాపు రూ.20లక్షలకుపైగా ఉంటుందిని అధికారులు అంచనా వేస్తున్నారు.భారీగా నగదుతోపాటు,బ్యాంక్ ఖాతాల్లో రూ.5లక్షలవిలువైన ప్రామిసరినోటు, రెండు కార్లను అధికారులను గర్తించారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}4k5qkl0WFQ8{/youtube}