ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కుతోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాకాణి మాట్లాడుతూ,… జగన్ ప్రతిపాదించిన “మావిగన్” అంశంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో చర్చ ప్రారంభమైందన్నారు. ఈ ప్రతిపాదన వల్లనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబులో భయం మొదలైందని ఆరోపించారు.
చంద్రబాబు అవినీతి బయటపడే అవకాశముందని భావించి, “మావిగన్”పై దుష్ప్రచారం చేస్తున్నారని కాకాణి విమర్శించారు. అలాగే, జగన్ను వ్యక్తిగతంగా విమర్శించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చినట్లు ఆరోపించారు.
మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు, ర్యాంకింగ్స్ కోసం కొందరు ఎమ్మెల్యేలు జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెరుగుతున్న వ్యక్తిగత విమర్శలను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాక, రాబోయే రోజుల్లో మహిళలే “ఎల్లో మీడియా”కి తగిన సమాధానం చెబుతారని కాకాణి పేర్కొన్నారు.
