ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ పోలీసుల చాకచక్యంతో ఒక కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలుడిని పోలీసులు కేవలం 72 గంటల్లోనే పంజాబ్లో సురక్షితంగా గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సహరాన్పూర్కు చెందిన ఒక బాలుడు అనుమానాస్పద స్థితిలో అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడు కనిపించకుండా పోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ నెట్వర్క్ మరియు స్థానిక సమాచారం ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.దర్యాప్తులో భాగంగా బాలుడు పంజాబ్ సరిహద్దుల్లో ఉన్నట్లు సమాచారం అందింది. వెంటనే పంజాబ్ పోలీసుల సహకారంతో గాలింపు చేపట్టి, 72 గంటలు గడవక ముందే బాలుడిని క్షేమంగా పట్టుకున్నారు.
బాలుడిని సురక్షితంగా సహరాన్పూర్కు తీసుకువచ్చిన పోలీసులు, అధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. తన బిడ్డను తిరిగి చూసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
