- Advertisement -

లలిత్ మోదీకి బిగ్ రిలీఫ్

- Advertisement -

2009లో సార్వత్రిక ఎన్నికల కారణంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రెండవ సీజన్‌ను భారత్ నుంచి దక్షణాఫ్రికాకు తరలించిన సమయంలో జరిగిన ఫెమా (విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘన కేసులో భారత క్రికెట్ నియంత్రణ మౌలిక భద్రతా బోర్డు (BCCI)కు భారీ ఉపశమనం లభించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విధించిన జరిమానాలను సాఫెమా (SAFEMA) పరిధిలోని అప్పెలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. అలాగే జరిమానా మొత్తాన్ని భారీగా తగ్గించింది. నాటి బీసీసీఐ కార్యదర్శి ఎన్. శ్రీనివాసన్, కోశాధికారి ఎం.పి. పాండోవ్, ఉపాధ్యక్షుడు మరియు ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీలకు ఈ ఉత్తర్వుల ద్వారా ఉపశమనం లభించింది. ట్రిబ్యునల్ జూలై 16న ఈ సంచలన తీర్పును వెలువరించింది.

ఈ తీర్పుతో లలిత్ మోదీకి బిగ్ రిలీఫ్ లభించింది. దక్షిణాఫ్రికాలో ఐపీఎల్-2 నిర్వహణ వెనుక ప్రధాన సూత్రధారి అని మోదీని అభివర్ణించిన ట్రిబ్యునల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భావన అంతా అప్పీలెంట్ (మోదీ) ఆలోచన నుంచే వచ్చిందనేది అంగీకరించబడిన విషయమే అని పేర్కొంటూ ఆయనపై విధించిన జరిమానాను పూర్తిగా రద్దు చేసింది.

ఈ తీర్పుపై లలిత్ మోదీ హర్షం వ్యక్తం చేశారు. నాపై ఈడీ మోపిన మోసపూరిత కేసు యొక్క మూల సూత్రాన్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. 2009లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్-2 నిర్వహణకు సంబంధించి పంపిన విదేశీ ద్రవ్యం ‘కరెంట్ అకౌంట్ లావాదేవీలు’ అని, ‘క్యాపిటల్ అకౌంట్ లావాదేవీలు’ కాదని తీర్పు చెప్పడం ద్వారా నిజం గెలిచిందన్నారు.

భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు నిధుల తరలింపు ఫెమా చట్టం మరియు నిబంధనలకు విరుద్ధమని భావించగా.. తాము నిబంధనలు తెలియక పొరపాటు పడ్డామే తప్ప, ఎలాంటి దురుద్దేశంతో ఇలా చేయలేదని బీసీసీఐ అధికారులు వాదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -