Friday, May 9, 2025
- Advertisement -

ముఖేస్ అంబాని ప‌క్కా బిజినెస్ … దీనివెనుక భారీ దోపిడీనా…?

- Advertisement -

రిల‌య‌న్స్ జియో ప్రీ ఆప‌ర్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌ దేశంలోని టెలికంరంగంలో పెను విప్ల‌వాన్ని తీసుకొచ్చింది. అప్ప‌టి వ‌ర‌కు కొంద‌రికె ప‌రిమిత‌మైన ఇంట‌ర్నెట్ బిచ్చ‌గాడుకూడా ఇంట‌ర్నెట్‌ను వాడుతున్నారు. జియే ప్ర‌వేశంతో మిగితా టెలికం కంపెనీలు విల‌విల్లాడాయి. అవి కూడా ఆప‌ర్ల‌మీద అప‌ర్లు ప్ర‌క‌టించారు.
ప్ర‌స్తుతం జియేకు 12.5కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. ప్ర‌స్తుతం అంద‌రు 250 కోట్ల నిమిషాల వాయిస్ కాల్స్ వినియేగిస్తున్నారు. జియే రాక‌ముందు 20 కోట్ల జీబీని డేటాను నెల‌కు వాడె వారు. ఇప్పుడు నెల‌కు 120 కోట్ల జీబీ డేటాను వాడుత‌న్నారు.
తాజాగా జియే ఫోన్‌ల‌ను (Free Reliance Jio Phone) ఉచితంగా అందిస్తున్నామని ముఖేష్ అంబాని మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపారు.ఒక్క రూపాయి తీసుకోకుండా వినియేగ దారుల‌కు పోన్‌ను అందిస్తున్న‌ట్లు అన్న అనుమానాలు మార్కెట్ వ‌ర్గాల్లో వ్య‌క్తం అయ్యింది.ఇప్పుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇత‌ర టెలికంకంపెనీల‌కు దిక్కుతోచ‌డంలేదు. అస‌లు దీని వెనుక ప‌క్కా బిజినెస్ ప్లాన్ ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.
కొత్త 4జీ ఫోన్‌ను పొందాలంటె ముందుగా సెక్యూరిటి డిపాజిట్ కింద రూ.1500 చెల్లించాల‌ని సూచించారు. దీన్ని మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి ఇచ్చేస్తామ‌న్నారు. వినియేగ దారుడు ఉచితంగా పోన్ పొందాలంటె ప‌దిహేనువంద‌లు చెల్లించాలి. ప‌ది ల‌క్ష‌ల మంది చెల్లించార‌నుకుందాం. సాదార‌నంగా కోటి రూపాయ‌లు డిపాజిట్ చేస్తే దానిమీద దాదాపుగా రెండు ల‌క్ష‌లు వ‌డ్డీ వ‌స్తుంది.అదే ప‌దిల‌క్ష‌ల మంది క‌ల‌సి రూ.150 కోట్లు అవుతుంది. దీన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే రూ.3.5 కోట్లు వ‌స్తాయి.
మూడు సంవ‌త్స‌రాల‌కి రూ.126 కోట్లు వ‌స్తుంది. ప్ర‌స్తుతం 12.5 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. ఈ లెక్క‌న వేసుకుంటె ఎతంలాభ‌మో ఆలోచించండి. రూపాయి ఆదాయంలేనిదే ఎవ‌రూ బిజినెస్ చేయ‌రు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -