Tuesday, April 30, 2024
- Advertisement -

సినిమావాళ్లు రోజుకో భర్తను మారుస్తారా…!

- Advertisement -

పద్మావతి సినిమా కాంట్రవర్సీ పీక్స్ కు వెళ్లిపోయింది. తాజాగా ఈ సినిమా రచ్చలో బిజేపి ఎంపి చింతామణి హాట్ సీట్ లోకి వచ్చారు. ఆయన సినిమా వాళ్లను ఉద్దేశిస్తూ… సినిమా కుటుంబాల్లో వుండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటివాళ్లకు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం బలిదానం చేసుకున్నవారి’ గురించి ఏం తెలుస్తుందని పెద్ద బాంబే పేల్చారు. అయితే ఆయన చెప్పిన మాటలు పద్మావతి పాత్రను చేసిన దీపికా పదుకునే గురించి. కాని ఆయన మాటలు వక్రీకరణకు గురయ్యాయి.

సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావతి’కి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో ఇలా అభ్యంతరకర కామెంట్స్ చేశారు . అన్నట్లు ఈయన మధ్యప్రదేశ్‌కి చెందిన బిజేపి ఎంపీ గారు.అక్కడితో ఊరుకోకుండా పద్మావతి సినిమాలో పద్మావతి,అల్లాద్ధీన్ ఖిల్జిల ఎఫైర్ గురించి …ఇన్ డైరెక్ట్ గా ఇలాంటి హీనమైన ఆలోచనున్న సినిమావాళ్లను ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు . అల్లావుద్దీన్ ఖిల్జీ బారిన పడకుండా ఉండేందుకు రాణి పద్మిణి బలిదానం చేసుకుందని చరిత్ర చెబుతుండగా… సినిమాలో మాత్రం వీళ్లిద్దరి రొమాన్స్ ఉన్నట్లు వార్తలు ఎలా వస్తున్నాయని..దీనిని సినిమాలో చూపిస్తే మాత్రం యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు.

ప్రతి భారతీయ మహిళకు రాణిపద్మిణి ఆదర్శమని, సమాజ గౌరవాన్ని కాపాడేందుకు ఆమెతోపాటు వేల మంది మహిళలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆయన ఆవేశంగా చెప్పారు. ఇప్పటికే రాజ్‌పుత్‌లు,కర్ణిసేన సినిమాపై ఫైర్ అవుతుండగా… రాణి పద్మిణిని అవమానిస్తే ఈ దేశం భరించదని, ఘనమైన చరిత్రను వక్రీకరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఆవేదనతో రాసుకొచ్చారు ఎంపీ చింతామణి గారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -