రాం చరణ్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనేదాని మీద పెద్ద చర్చ సాగుతోంది. చరణ్ సినిమాలో అన్నీ కుదిరి, తానీ ఒరువన్ రైట్స్ కూడా నాలుగు కోట్లకి కొనుక్కుని వచ్చిన ఈ తరుణంలో వింతగా విలన్ విషయంలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
ఈ విషయంలో అల్లూ అరవింద్ రంగం లోకి దిగి మరీ చరణ్ కి కొత్త సలహా ఇచ్చాడట. ఒరిజినల్ తనీ ఒరువన్ లో విలన్ గా చేసిన అరవింద్ స్వామీ చాలా మార్కులు కొట్టేసాడు కానీ తెలుగులో మళ్ళీ అదే క్యారెక్టర్ చెయ్యడానికి ఆయన ఒప్పుకోవట్లేదు. మరి ఆయన ప్లేస్ లో జగపతి బాబునో మరెవరినైనా తీసుకోవడం కంటే చరణ్ మనసులో మల్టీ స్టారర్ ఆలోచన ఉండడం తో ఆ కోటా లో ఇందులో వెంకటేశ ని కానీ నాగార్జున ని కానీ తీసుకుందాం అని మెగా మామ సలహా అట. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోని విలన్ గా ఒప్పించాలన్నది అరవింద్ ఆలోచన. నాగార్జున – వెంకటేష్ లలో ఎవరో ఒకరితో ఈ పాత్ర చేయించాలని చూస్తున్నాడు రామ్ చరణ్ కూడా. మంచి స్టొరీ తో మల్టీ స్టారర్ చెయ్యాలి కానీ సాధారణ కథతో ఇద్దరూ హీరోలు గా కాదు అనేది చరణ్ ఆలోచన. మరి చరణ్ సరసన విలన్ గా చెయ్యడానికి వారిద్దరిలో ఎవరు ఒప్పుకుంటారు అని పెద్ద క్యూస్షన్.
{youtube}-7Upwny0Vzo{/youtube}