Monday, May 20, 2024
- Advertisement -

విక్రమ్‌పై దుండగులు దాడి

- Advertisement -

కన్నడ నటుడు కార్తిక్‌ విక్రంపై దుండగులు దాడి చేసి నిలువు దోపిడీ చేశారు. ఈసంఘ‌ట‌న‌ బసవేశ్వరనగర పరిధిలో జరిగింది. కెహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న నటుడు కార్తీక్‌ విక్రం మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో స్నేహితుడిని ఇంటి వద్ద డ్రాప్‌ చేశాడు.

తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా దుండుగులు వాహనాన్ని అడ్డగించి ఘర్షణకు దిగారు. అనంతరం అతనిపై దాడి చేసి కారు, మొబైల్‌ లాక్కొని ఉడాయించారు. కార్తీక్‌ విక్రం ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -