సినీ పరిశ్రమకు చెందిన వారందరూ ఓ టీవీపై కక్ష గట్టినట్టూ కనిపిస్తున్నారు. అందరూ ఒక్కటై ఓ టీవీ చానెల్పై కేసు నమోదు చేశారు. సినీ పరిశ్రమలోని నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ తెలుగు టీవీ ఛానెల్ ఎడిటర్పై టాలీవుడ్కు చెందిన వారందరూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ప్రత్యేక హోదా విషయమై తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి ఓ తెలుగు టీవీ ఛానల్ పోసానితో లైవ్ డిబేట్ పెట్టింది. ఆ సమయంలో టాలీవుడ్లో పనిచేస్తున్న మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా పలువురు మాట్లాడారని ఫిర్యాదులో తెలిపారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో టాలీవుడ్ నటీనటులు ఝాన్సీ, హేమ, శివాజీ రాజా, బెనర్జీ, ఉత్తేజ్ తదితరులు ఉన్నారు. మా అసోసియేషన్ కూడా స్పందించి వారికి మద్దతుగా నిలబడింది.