తమిళ్ హీరో విశాల్ ఇంటి వద్ద పోలీస్ భద్రత ఉంచారు.దీనికి కారణం విశాల్ నటించిన సినిమా ‘ఇరుంబు తిరై’.సినిమాలో కేంద్ర ప్రభుత్వంపై కొన్ని సైటైర్స్ ఉన్నాయని నిరసిస్తున్న హిందూ సంస్థలు సినిమా నుండి వాటిని తొలగించాలని కొరారు. కాని విశాల్ ఇవేమి పట్టించుకోకుండా సినిమాను యథావిధిగా విడుదల చేశారు.దీంతో హిందూ సంస్థలు విశాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు విశాల్ ఇంటిని ,సినిమా ప్రదర్శించే థియోటర్స్ను ముట్టడించాలని పిలుపినిచ్చారు.
ఈ నేపథ్యంలో హీరో విశాల్ ఇంటిపై దాడి జరగవచ్చు అని అనుమానంతో పోలీసులు హీరో విశాల్ ఇంటితో పాటు సినిమా థియోటర్స్ వద్ద భద్రతను పెంచారు.గతంలో ఇలానే హీరో విజయ్ నటించిన మెర్సిల్ సినిమాలో జీఎస్టీ గురించి కొన్ని డైలాగ్స్ ఉన్నాయని సినిమాలో వాటిని తొలిగించే వరకు బీజేపి అందోళన చేశారు.ఇప్పుడు విశాల్ సినిమా ఎంత వరకు వెళ్లుతుందో చూడాలి.