Saturday, April 27, 2024
- Advertisement -

పాల్‌ దినకరన్‌ ఇంట్లో ఆశ్చర్యం.. బంగారం నృత్యం..!

- Advertisement -

క్రైస్తవ మత ప్రచారకుడు పాల్‌ దినకరన్‌ ఇళ్లు, కార్యాలయాలు, సంస్థలు, ఫౌండేషన్‌లలో తమిళనాడు ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం నుంచి సోదాలు చేస్తున్నారు. లెక్కలోకి రాని రూ.120 కోట్ల పెట్టుబడులు గుర్తించారు. కోయంబత్తూరులోని కారుణ్య విశ్వవిద్యాలయంలో 5 కిలోల బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకొన్నారు. విచారణకు హాజరుకావాలని ఆయనకు అధికారులు నోటీసు పంపారు.

పాల్‌ దినకరన్‌కు చెందిన ‘జీసస్‌ కాల్స్‌’ సంస్థ కార్యాలయాలు, కారుణ్య విశ్వవిద్యాలయం తదితర 28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. 20వ తేదీన ప్రారంభించిన ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయి. సభల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని.. స్వదేశం, విదేశాల నుంచి వచ్చిన ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -