- Advertisement -
రవితేజ సినిమా నుండి తప్పుకుంది హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్.రవితేజ ప్రస్తుతం ‘అమర్ అక్బర్ అంటోని’ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు.అయితే ఈలోపే షాక్ తగిలింది చిత్ర యూనిట్కి. సడన్గా సినిమా నుండి తప్పుకుంది హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్.అయితే దీనిపై హీరో రవితేజ స్పందించాడు.”అనూ ఇమ్మాన్యుయేల్ ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించింది.
అవే డేట్స్ లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేయవలసి వచ్చింది. ఇబ్బంది అవుతుందని భావించే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. అంతే కాని వేరే కారణాలు లేవని ఆమెతో తప్పకుండా మరో సినిమా చేస్తానని తెలిపాడు.రవితేజ ప్రస్తుతం నేల టిక్కెట్టు సినిమా ప్రమోషన్స్తో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల(మే) 25న విడుదల కానుంది.