ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో బాబు మోసం చేసిన తీరు, ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన బంద్ సక్సెస్ అయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బాబు సర్కారు ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా బంద్ను అణిచివేసే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. మా పార్టీకి పది మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీనీ స్తంభించేసే వాడినని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జగన్.
మన కర్మ ఏంటంటే.. ఇవాళ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నా మనం వినాల్సి వస్తోంది. నిజంగా, ఇది మన కర్మే. నాలుగేళ్లు ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారితో, బీజేపీతో..వాళ్లిద్దరితో కలిసి కాపురం చేశాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ, బీజేపీల నుంచి ఆయన (పవన్ కల్యాణ్) బయటకొచ్చి తాను పతివ్రతను అని గట్టిగా చెబుతున్నాడని ఎద్దేవ చేశారు.
భాజాపా, టీడీపీతో నాలుగు సంత్సరాలు కాపురం చేసి ఎన్నికలు ఆరునెలలు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో ’నేను తప్పు చేశాను’ అంటాడు. ఇంకో ఆయనేమో ‘నేను కాదు తప్పు చేసింది..మిగతా ఇద్దరు’ అంటాడు. మరో ఆయనేమో ‘ఆ ఇద్దరూ ఆమోదం తెలిపిన తర్వాతే..’ అని అంటాడు.
చంద్రబాబుకు అవసరం ఉన్నప్పుడు బయటకు వచ్చి ట్వీటో లేక ఇంటర్యూ ఇచ్చి వెల్తారన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఇదే జరిగిందన్నారు. ఇలాంటి లాంటి వ్యక్తి రాజకీయాల్లో మాట్లాడటం మొదలు పెడితే.. దానికి మనం సమాధానం చెప్పాలంటే..ఎక్కడున్నాయి విలువలు? వాటి గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టుగా పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారో ఐదేళ్లకోసారో పెళ్లాన్ని మారుస్తాడు. మీరో, నేనో ఈ పని చేస్తే.. ‘నిత్యపెళ్లికొడుకు’ అని బొక్కలో వేస్తారా? లేదా? ఇది పాలీగామీ కాదా? ఇలాంటి వాళ్లు ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు బయటకొచ్చి.. తానేదో సచ్ఛీలుడను అని మాట్లాడతారని ఆరోపించారు.