టాలీవుడ్ హీరోలు మైండ్ సెట్ మారింది.ఒకరి సినిమాలపై మరోకరు ప్రశంసించుకుంటున్నారు.ఒకరి హీరోల ఫంక్షన్కు మరోకరు వస్తున్నారు.తాజాగా అలాంటే సంఘటనే ఒకటి జరిగింది.చిరంజీవి – బాలకృష్ణ. వీరిద్దరు సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హోరా హోరీగా తలపడిన వారే. వీరిద్దరు కూడా ఎన్నో సార్లు బాక్సాఫీస్ ఫైట్ కు తెరలేపారు. వీరిద్దరి అభిమానుల మద్య తారా స్థాయిలో అప్పట్లో వివాదాలు ఉండేవి. కాని తామిద్దరం మంచి మిత్రులం అని ఎప్పటికప్పుడు చాటి చెబుతున్నారు.బాలకృష్ణ సినిమా వేడుకలో పాల్గొన్న చిరంజీవి మరో సారి బాలయ్యపై ఆత్మియతను చాటుకున్నాడు. ఇక తాజాగా చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో బాలకృష్ణ సెట్స్ కు వెళ్లి చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్చర్యపర్చాడు.
ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంకు సంబంధించిన చిత్రీకరన హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతుంది. సైరా చిత్రీకరణ కూడా ఆ పక్కనే జరుగుతుందని తెలుసుకున్న బాలకృష్ణ చిరు సైరా సెట్కు వెళ్లారని సమాచారం.బాలయ్య రాకతో చిరు ఒక్కసారిగా షాక్కు గురైయ్యారని తెలుస్తుంది.ఇద్దరు దాదాపు గంట పాటు సరదాగా ముచ్చటించుకున్నారట. ఒకటి రెండు షాట్స్ చిత్రీకరణను బాలకృష్ణ దగ్గరుండి మరీ చూసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కాని న్యూస్ కాని ఎక్కడ బయటికి రాలేదు.మరి బాలయ్య చిరు సైరా సెట్కు వెళ్లాడని మాత్రం సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి.ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి.