ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. రోహిత్ శర్మ తిరిగి బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించగా తుది జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న పలువురు యువ ఆటగాళ్లు నెట్స్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
ఫిట్నెస్ నిరూపించుకుంటేనే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలను ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు ఎంపిక చేస్తామని బోర్డు పేర్కొంది. అయితే పాండ్యా కాలి గాయం (లెగ్ స్ట్రెయిన్) కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా రోహిత్కు మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బుధవారం సాయంత్రం రోహిత్ శర్మ మొదట తేలికపాటి రన్నింగ్తో శిక్షణ ప్రారంభించి ఆపై సెంటర్-వికెట్ ప్రాక్టీస్కు వచ్చారు. రోహిత్, అయ్యర్ ఎక్కువ బంతులు ఆడేకొద్దీ తమ పాత ఫామ్ను అందుకున్నారు. ఒకసారి క్రీజులో సెట్ అయిన తర్వాత ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో రోహిత్ తన ట్రేడ్మార్క్ ‘పుల్ షాట్’ ను కూడా ఆడారు.
జట్టులో వికెట్ కీపర్గా కెఎల్ రాహుల్ భారత్ మొదటి ప్రాధాన్యత అయినప్పటికీ విరాట్ కోహ్లీ ఈ సిరీస్కు అందుబాటులో లేకపోవడంతో కిషన్కు నంబర్ 3లో అవకాశం దక్కవచ్చు. అయితే కిషన్కు కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్ నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడిన తుది జట్టు (XI) నుండి ప్రాక్టీస్కు వచ్చిన ఏకైక ఆటగాడు జైస్వాల్ మాత్రమే. పాండ్యా గాయపడటంతో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక కానున్నారు.
ఫాస్ట్ బౌలర్లలో అర్ష్దీప్, బ్రార్, ప్రిన్స్ తమ కోటాను పూర్తి చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్, రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉన్నారు.
