యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖారారు చేసుకుంది.అక్టోబర్ 11న అరవింద సమేత సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.సినిమాను అక్టోబర్ 11నే ఎందుకు విడుదల చేస్తున్నారో చాలమందికి అర్ధం కావడం లేదు.అయితే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలతో పాటు హీరో జాతకాన్ని కూడా పరిశీలించిన పండితులే ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట.
పైగా ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమా కూడా దసరాకే విడుదలై మంచి విజయం సాధించింది.దీంతో సినిమాను అక్టోబర్ 11ను విడుదల చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్కి ,టీజర్కి ,పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపాలనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా తాజా సమాచారం. సినిమాలో హీరోయిన్స్గా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు నటిస్తున్నారు.