బిగ్బాస్ రెండో సీజన్ ఎంత అట్టహాసంగా ప్రారంభం అయిందో.అంతే ఘనంగా ముగిసింది.న్యాచురల్ స్టార్ నాని హౌస్ట్గా వ్యవహారించిన బిగ్బాస్ రెండో సీజన్ ,16 మంది కంటెస్టెంట్లుతో మొదలైంది.ఈ 16 మందిలో ముగ్గురికి కామన్ మ్యాన్స్కి చోటు కల్పించారు.118 రోజుల పాటు జరిగిన ఈ రియాల్టీ షోలో కౌశల్ విన్నర్గా నిలిచాడు.ఆదివారం జరిగిన ఫైనల్స్లో గీతా మాధురితో పోటీ పడిన కౌశల్ విజేతగా నిలిచాడు.బిగ్బాస్ విన్నర్ కౌశల్ ప్రయాణాన్ని ఒకసారి గమనిద్దాం.బిగ్బాస్లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చాడు కౌశల్.
ఒకప్పుడు సినిమాలలో నటించిన కౌశల్,ఇప్పుడు సీరియల్స్లో నటిస్తున్నాడు. కౌశల్ప్రేక్షకులకు పెద్దగా ఎవరికి తెలియదు కూడా.బిగ్బాస్ హౌస్లో కౌశల్ను చూసిన వారు ఇతను రెండు ,మూడు వారాలలో బయటికి వచ్చేస్తాడని భావించారు.దానికి తగినట్లుగానే కౌశల్ రెండో వారంలోనే బయటికి వచ్చేవాడు.షో మొదటి వారంలో కౌశల్ హౌస్లో ఉన్న ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని చాలమంది ఫిర్యాదు చేశారు.దీప్తి సునైనాను ఎత్తుకుని తీసుకువెళ్లాడాన్ని చాలమంది తప్పు పట్టారు.దీనిలో భాగంగానే కౌశల్ను రెండో వారం చాలమంది ఎలిమినేషన్కు నామినేట్ చేశారు.అయితే ఎలిమినేషన్ లోపులో కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు,తనీష్తో గొడవ పెట్టుకోవడం,తనీష్ని నూతన్ మూసుకో అని తిట్టడంతో ఆ వారం నూతన్ నాయుడు ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశాడు.
తనీష్తో నూతన్ నాయుడు గొడవ లేకపోతే ఖచ్చితంగా ఆ వారం కౌశల్ బయటికి వచ్చేవాడు.ఆ వారం తరువాత కౌశల్ తనలోని అసలైన గేమ్ని బయటికి తీసి ఆడటం మొదలు పెట్టాడు.హౌస్మెట్స్ అందరిని ఒక్కటి చేసిన ఘనత ఖచ్చితంగా కౌశల్కే దక్కుతుంది.నేను ఒంటరి,నేను ఏకాకి అనే ఫిలింగ్ బయట ఉన్న ప్రేక్షకులలో కల్గించాడు కౌశల్.దీని కారణంగానే సోషల్ మీడియాలో కౌశల్కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.ఎప్పుడు అయితే తనకు బయట భారీ ఫాలోయింగ్ ఉందని తెలుసుకున్న కౌశల్,ఇక వెను తిరిగి చూసుకోలేదు.హౌస్లో ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాకున్నాడు.బిగ్బాస్ గేమ్ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కౌశల్ విజయం సాధించాడు.
ఎప్పుడైతే గీతా మాధురి తనకు పోటీనిస్తుందిని భావించాడో అప్పటి నుంచి గీతాను టార్గెట్ చేసుకుని ,ఆమెపై గేమ్ ఆడటం మొదలు పెట్టాడు.ఇది అంతా కౌశల్ ఆడిన గేమ్లో ఓ భాగం అని తెలుస్తుంది.తన ప్రణాళికను పక్కాగా అమలు చేయడంలో విజయం సాధించిన కౌశల్,బిగ్బాస్ విన్నర్గా నిలవడంలో పెద్దగా ఎవరికి ఆశ్చర్యం కల్గించలేదు.