టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుతుంది.#మీటు కార్యక్రమంతో బాలీవుడ్లో పెద్ద ఉద్యమమే నడుసస్తుంది.నటీమణులు తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా నానా పటేకర్పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటిక వరకు మహిళలు మాత్రమే తమకు జరిగిన వేధింపుల గురించి చెప్పడం జరుగుతుంది.కాని తాజాగా పురుషులు కూడా తమకు జరిగిన వేధింపుల గురించి వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, 25 ఏళ్ల క్రితం తాను వేధింపులకు గురయినట్టు తెలిపాడు. అయితే, అవి లైంగిక వేధింపులు కావని, అయినప్పటికీ ఆ వేధింపులను తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు మండిపోతుందని చెప్పాడు. తాను ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టలేనని… ఎందుకంటే ఇప్పుడు తాను సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తినని తెలిపాడు.ఇక నుంచి అయినా మహిళల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని సైఫ్ చెప్పాడు. సినీ పరిశ్రమలో ఏది జరిగినా మన మంచికేనని… మీటూ ఉద్యమం ద్వారా తప్పులు చేసిన వారి నిజస్వరూపాలు బయటపడుతున్నాయని అన్నారు.