- Advertisement -

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై వీడని సందిగ్ధం!

- Advertisement -

ఇవాళ ఇరాన్‌తో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నొక్కిచెబుతుండగా ఇరాన్ మాత్రం దీనిపై ఎలాంటి తేదీని ధృవీకరించకపోవడంతో అసలు ఈ రోజు శాంతి ఒప్పందం జరుగుతుందా లేదా అనే విషయంపై తీవ్ర గందరగోళం నెలకొంది.

మిడిల్ ఈస్ట్‌లో గత మూడు నెలలకు పైగా సాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు తాము శాంతి ఒప్పందానికి దాదాపు చేరువయ్యామని అమెరికా, ఇరాన్ దేశాలు ధృవీకరించాయి. అయితే ఈ శాంతి ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు జరుగుతాయనే దానిపై పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ సంతకాల ప్రక్రియ ఆదివారం జరుగుతుందని వాషింగ్టన్ అంటుంటే, టెహ్రాన్ (ఇరాన్) మాత్రం దీనిని పూర్తిగా తోసిపుచ్చింది.

ఇరాన్ అధికారులు మాట్లాడుతూ ఆదివారం ఎలాంటి సంతకాలు జరగబోవని స్పష్టం చేసింది. అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేసే ఖచ్చితమైన తేదీ కోసం మనం వేచి చూడాల్సిందే అయితే అది రేపు (ఆదివారం) మాత్రం కాదు… రాబోయే రోజుల్లో ఇది జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ పేర్కొన్నట్లు స్థానిక మీడియా నివేదించింది.

ఈ ఒప్పందం ఆదివారమే జరుగుతుందని ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. అయితే ఇది వర్చువల్ (ఆన్‌లైన్) పద్ధతిలో జరుగుతుందా లేదా ఆయన గతంలో చెప్పినట్లు ఐరోపాలోని ఏదైనా ప్రాంతంలో జరుగుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ అనిశ్చితిని మరింత పెంచుతూ… జెనీవాలో ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ఆక్సియోస్ (Axios) మరియు సిబిఎస్ (CBS) సంస్థలు నివేదించగా, ఇరాన్ మాత్రం ఈ ప్రక్రియ వర్చువల్‌గానే జరుగుతుందని పట్టుబడుతోంది.

మనం మునుపెన్నడూ లేనంతగా శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాము. రాబోయే 24 గంటల్లో ఇది ఖరారయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత వెంటనే శాంతి ఒప్పందంపై ఎలక్ట్రానిక్ సంతకాలు చేయడానికి పాకిస్తాన్ సిద్ధమవుతోంది. ఆపై వచ్చే వారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగుతాయి అని షరీఫ్ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -