Wednesday, May 1, 2024
- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై కాంగ్రెస్ సెటైర్లు..

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ ఇడుపుల పాయ‌లో చేప‌ట్టిన పాద‌యాత్ర ఈ రోజు ఇచ్చాపురంలో నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌తో శుభం కార్డు ప‌డ‌నుంది. 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాలు ప్రజల్లోకి తీసుకెళుతూ.. ప్రజా సంకల్పమంటూ ముందుకు సాగారు.

తాజాగా పాద‌యాత్ర‌పై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. పాద‌యాత్ర‌లో సెల్ఫీలు, ముద్దులు త‌ప్ప ఏమీ లేవ‌ని సెటైర్లు వేశారు. పాద‌యాత్ర‌లో చెప్పుకోవ‌డానికి ఏమీలేద‌ని రోజుకు రూ.2 కోట్లు ఖర్చుత‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమి లేద‌న్నారు.

ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తుపై కూడా స్పందించారు. సైకిల్‌తో పొత్తు విష‌యాన్ని త్వ‌ర‌గా తేల్చాల‌ని అధిష్టానాన్ని కోరిన‌ట్లు తెలిపారు. దేశ రాజ‌కీయాల్లో భాజాపా, కాంగ్రెస్ కూట‌ములు మాత్ర‌మే ఉంటాయ‌న్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కోసం కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు వృధాప్ర‌యాసేన‌న్నారు. పొత్తుపై త‌మ అభిప్రాయాల‌ను రాహుల్‌కు చెప్పామ‌ని తుది నిర్ణ‌యం ఆయ‌న‌దేనన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -