టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పక్కన హీరోయిన్గా చేయలంటే ఎంతో అదృష్టం పెట్టి పుట్టాలి. మహేశ్ బాబుతో సినిమా చేయలని బాలీవుడ్ హీరోయిన్లు సైతం రెడీ అంటారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే అసలు వదులుకోనని తెలిపింది. అలాంటి మహేశ్తో తన తొలి సినిమాలోనే హీరోయిన్గా నటించింది కృతి సనన్. మహేశ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 1 నేనొక్కిడినే సినిమాలో హీరోయిన్గా పరియియం అయింది కృతి సనన్.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచినప్పటికి ఆమెకు బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో అక్కడ ఆమె క్రీజీ హీరోయిన్గా మారింది. తాజాగా ఈ భామ ఓ ఐటం సాంగ్లో కనిపించనుందని సమాచారం. కరణ్ జోహర్ నిర్మాణంలో వరుణ్ ధావన్, ఆదిత్య చోప్రా హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కలాంక్లో కృతి సనన్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పటికే ఈ పాటకు సంబందించిన షూటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది.
- ఏపీకి భారీ వర్షసూచన..అలర్ట్!
- పొగాకు రైతులకు మద్దతుగా రంగంలోకి జగన్…
- భారత్లో పెళ్లి..విదేశాల్లో విడాకులా?
- మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- నందమూరి ఫ్యామిలీ నుండి మరో పొలిటికల్ ఎంట్రీ?
