ఏపీలో రోజు రోజుకి రాజకీయాలు ముదురుతున్నాయి. టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వలసలు పెరగడంతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు నాగర్జున కూడా వైసీపీ అధినేత జగన్ను కలవడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరస్థుడు అయిన జగన్ను నాగర్జున కలవడం ఏంటని చంద్రబాబు నాగ్ను ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా టీడీపీ నేతలతో ఆయన బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహంచారు.
కొందరు సినీ హీరోలు జగన్కు సరెండర్ అవుతున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నాగ్ మాత్రం తాను మర్యాదపూర్వకంగానే జగన్ను కలిశానని, అంతకుమించి మా భేటీలో ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని ఆయన మీడియాకు తెలిపారు. అయితే నాగ్ వచ్చే ఎన్నికలలో వైసీపీ తరుపున గుంటూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగుతుంది.ఏం ఆశించి నాగర్జున జగన్ను కలిశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీని వీడే వారి వల్ల నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా నుంచి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెడుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
- Advertisement -
నాగర్జునపై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -