వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో రెచ్చిపోయారు. ప్రతీ సారి లోకేష్, బాబును టార్గెట్ చేసె విజయసాయి ఈ సారి రూటు మార్చారు. ఈ సారి తన ట్విట్టర్ బాణాన్ని జనసేనలో చేరిన మాజీ జేడీ లక్ష్మినారాయణపైకి ఎక్కుపెట్టారు. ఆదివారం జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మీరు ఇప్పుడు జనసైనికుడిగా మారానని చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదకిగా సంచలన ఆరోపనలు చేశారు.
మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేశారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఇక చంద్రబాబుపై కూడా ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. 35 ఏళ్లుగా చంద్రబాబు పులివెందుల అబ్సెషన్తో బాధపడుతున్నారు. 14 సంవత్సరాలు సిఎంగా ఉండి కూడా ఈ ఫోబియాల నుంచి బయట పడలేక పోయారేమిటి తుప్పు నాయుడు గారూ? అర్థంలేని భయాలను ప్రజలకు అంటించాలని చూస్తున్నారు. మంచి డాక్టర్ ను కలవండి చికిత్స ఇస్తాడు’ అని సెటైర్ వేశారు.
ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసిన తెలుగుదేశం ఎంఎల్ఏ ఎవరు?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దాడి ఘటనను ట్విట్టర్లో మరోసారి గుర్తుచేశారు.
మంత్రాలయం టీడీసీ అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు శనివారం దాడికి పాల్పడిన ఘటనపైనా స్పందించారు. తిక్కారెడ్డిని లేపేసే కుట్ర విఫలమైంది. సొంత గన్మెన్లతో ఆయనపై కాల్పులు జరిపించారు. పార్టీ అధినేతే ఈ స్కెచ్ వేశాడని తిక్కారెడ్డికి తెలియదు. బాలనాగిరెడ్డిపైకి నెట్టాలనేది పథకం. కుల మీడియా రోజంతా ఇదే ప్రచారం చేసింది. చివరకు గన్మెన్లు బలిపశువులయ్యారు’ అంటూ విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు భీ ఫారాలు ఇచ్చిన తర్వాత వారి వెంట మీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వర రావును పంపించండి. లేకుంటే ఎటైనా పారిపోతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.