వర్మ ఏ సినిమా తీసినా అది సంచలనమే. ఎందుకంటె సినిమా కంటె ముందు దానిపై వచ్చే విమర్శలకే ఎక్కు ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అనేక విమర్శలు మూటగట్టుకుంది.
ఈ సినిమా విడుదల కాక ముందే వర్మ మరో ఇద్దరి ప్రముఖ బయోపిక్లను లైన్లో పెట్టారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై పెద్ద దుమారం రేగుతోంది. సినిమాను అడ్డుకోవడానికి టీడీపీ నానా ప్రయత్నాలు చేస్తుంటె ఈనెల 29 విడుదల చేసేందుకు వర్మ రెడీ అవుతున్నారు.చంద్రబాబు నాయుడును విలన్ గా చూపించి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తీస్తున్నట్లుగా వర్మ బాహాటంగానె సెలవిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈనెల 29న విడుదల కాబోతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన వర్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అయిన తర్వాత వైఎస్ ఆర్ మరియు కేసీఆర్ ల బయోపిక్ ను కూడా తీయాలనుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఈ బయోపిక్ ల పర్వం ను ఎన్టీఆర్ తో వదిలేయకుండా వరుసగా సినిమాలు తీయాలని భావిస్తున్నట్లుగా వర్మ చెప్పిన నేపథ్యంలో ఆ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైఎస్ ఆర్ సినిమా గురించి వర్మ స్టోరీ లైన్ కూడా రివీల్ చేశాడు. వైఎస్ మరణించిన తర్వాత జరిగిన పరిణామాలపై వర్మ సినిమా తీయనున్నారు.
వైఎస్ ఆర్ మరణం తర్వాత తెలుగు రాష్ట్రం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వాటి వల్ల కొందరు పడ్డ లాభం ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం వంటి విషయాలను చూపించబోతున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. మరి వర్మ ఈ సినిమాను ఎలా చూపిస్తారో చూడాలి.