- Advertisement -
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. మొదటి నుంచి ఈ సినిమాను వివాదాలు చుట్టుముడతూనె ఉన్నాయి. ఈ సినిమాలో చంద్రబాబును విలన్లా చూపించారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఈసినిమా రిలీజ్ అయితే పార్టీకి భారీ డ్యామేజి తప్పదని తెలుగు తమ్ముళ్లు సినిమాను అడ్డుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే వర్మ మాత్రం ఈనెల 29న సినిమాను విడుదల చేసేందుకు రెడ్డీ అయ్యారు. ఇదలా ఉంటె సినిమా ప్రొడ్యూసర్ రాకేశ్ రెడ్డికి ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది బాలాజీ వథేరా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని రాకేశ్ రెడ్డి నోటీసులు పంపింది .