- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. జిల్లాలోని గుడ్లూరు మండలం శాంతినగర్ లో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అక్కడే ఆగిఉన్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. దీంతో స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధిత కుటుంబం విశాఖ నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది