- Advertisement -
ఎన్నికల పోలింగ్ ముగిసిన కూడా సత్తెన పల్లిలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ ఇరు పార్టీల నేతలపై కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. తాజాగా తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఫిర్యాదు చేశారు. ఇనిమెట్లలోని 160 పోలింగ్ బూత్ లో కోడెల శివప్రసాదరావు దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలను ఈసీకి అందజేశారు.
దౌర్జన్యం చేసిన స్పీకర్ కోడెలతో కుమ్మక్కై వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టారని అంబటి రాంబాబు ఆరోపంచారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత చేసిన తర్వాతే కోడెలపై పోలీసులు కేసు నమోదు చేశారని అంబటి తెలిపారు.