- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన 25వ సినిమా మహర్షి ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయ్యింది. మిశ్రమ స్పందనతో నడుస్తోంది. తొలి వీకెండ్ రికార్డుల గురించి మాటా మంతీ సాగుతున్నా సోమవారం తర్వాత ఈ సినిమా అసలు సత్తా ఎంతో తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇదలా ఉంటె సూపర్స్టార్ కృష్ణ కుటుంబ సభ్యుల కోసం ఏఎంబీలో స్పెషల్ షో వేసారని తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల దంపతులు.. నరేష్ ఫ్యామిలీ సహా బంధుమిత్రుల ఫ్యామిలీలు ఈ షోని వీక్షించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ, సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. విద్యార్థిగా, వ్యాపారవేత్తగా, రైతుగా మూడు పాత్రల్లో మహేశ్ నటన అదిరిపోయిందని తెలిపారు.
