ప్రస్తుతం స్టార్ హీరోస్, హీరోయిన్స్ సినిమాలతో ఒక వైపు బిజీగా ఉంటూనే మరో వైపు వ్యాపారరంగంలో రాణిస్తున్నారు. ఒక్క సినిమానె నమ్ముకోకుండా ఇతర వ్యాపారాల వైపు చూస్తున్నారు.ఇటీవలి కాలంలో మహేష్ బాబు ఏఎమ్బీ అనే మల్టీ ప్లెక్స్తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే. బన్నీ కూడా త్వరలోనే ఓ మల్టీప్లెక్స్ నిర్మించనున్నాడని అన్నారు. గతంలో కూడా నాగార్జున, చిరంజీవి ఒ ఛానల్లో భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం.
ప్రభాస్ రీసెంట్ గా తన మిత్రులతో కలసి ఒక ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ను మొదలు పెట్టాలని అనుకున్నాడట. దానికి కావలసివన్నీ రెడీ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో వినికిడి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు మాజీ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలసి ఈ ఛానల్ ను మొదలపెడుతున్నట్లు సమచారం.ఏదేమైన మన స్టార్స్ ఓ వైపు నటనని కొనసాగిస్తూనే మరోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్టడం విశేషం.
బాహుబలి తరువాత ప్రభాస్ సాహో, జాన్ అనే సినిమాల్లో నటిస్తున్నాడు. సాహో సినిమాకి ఇప్పటికి చాల హైప్ వచ్చింది. ఆడియన్స్ తమ అభిమాన హీరోని ఏప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఆశతో ఏదురుచుస్తున్నారు.ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్స్ ఇప్పటికే ఇంటర్నెట్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి. శ్రద్దా కపూర్ ప్రభాస్ కు జంటగా నటిస్తున్నారు. సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.