Tuesday, April 30, 2024
- Advertisement -

వీసా సమస్యల నుంచి గట్టెక్కిన అనుష్క

- Advertisement -

అనుష్క శెట్టి ప్రస్తుతం తన తదుపరి చిత్రం పనుల్లో బిజీ గా గడుపుతుంది. తన తొలి చిత్రం సూపర్ నుండి మొన్నటి భాగమతి వరకు ఎంతో కష్టపడి ఒక ఇమేజ్ ని సంపాదించుకుంది. కేవలం తన భుజాల మీద సినిమా ని మోసి పెద్ద హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ భామ కొంత కాలం గాప్ తీసుకొని ఒక కొత్త సినిమా ని ఒప్పుకుంది. సైలెన్స్ అనే టైటిల్ తో త్వరలో రానున్న ఈ చిత్రం షూటింగ్ అమెరికా లో ప్రారంభం కావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.

తాజా సమాచారం మేరకు, ఎట్టకేలకు ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ త్వరలో అమెరికా లో ప్రారంభం కానుంది. మొత్తానికి వీసా ప్రాబ్లమ్స్ తో సతమతమవుతున్న టీమ్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. అనుష్క వీసా అప్లికేషన్ కి మొత్తానికి క్లియరెన్స్ వచ్చింది. సో, ఇక ఫిలిం యూనిట్ షూటింగ్ కి తయారు కాబోతున్నారు. అనుష్క తో పాటు ఈ సినిమా లో మాధవన్, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే నటిస్తున్నారు. హాలీవుడ్ నటుడు మైకేల్ మాడ్సెన్ కూడా నటిస్తున్నాడు. హేమంత్ మధుకర్ ఈ సినిమా కి దర్శకుడు కాగా కోన వెంకట్, విశ్వా ప్రసాద్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -